ఎమ్మెల్యే రోజా నృత్యం..’నవ జనార్ధన’ లాస్యం
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా క్లాసికల్ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా… ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. సుప్రసిద్ద నాట్య గురువు కళాకృష్ణ పర్యవేక్షణలో ఎమ్మెల్యే ఆర్కే రోజా, సీఎస్ సుభారాజేశ్వరి నవ జనార్దన పారిజాతం డ్యాన్స్ ప్రదర్శనను ఇచ్చారు. అలాగే ఆంధ్రా నాట్య ప్రదర్శన కూడా ఎంతో అద్బుతంగా సాగింది. […]
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా క్లాసికల్ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా… ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. సుప్రసిద్ద నాట్య గురువు కళాకృష్ణ పర్యవేక్షణలో ఎమ్మెల్యే ఆర్కే రోజా, సీఎస్ సుభారాజేశ్వరి నవ జనార్దన పారిజాతం డ్యాన్స్ ప్రదర్శనను ఇచ్చారు. అలాగే ఆంధ్రా నాట్య ప్రదర్శన కూడా ఎంతో అద్బుతంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విచ్చేశారు. ఆమెతో పాటు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి, ప్రముఖ దర్శకుడు, ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ శివకుమార్, ఫౌండేషన్ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళిసై.. భారతీయ మట్టిలోనే.. సంస్కృతి, సాంప్రదాయాలు, దైవత్వం ఉందని పేర్కున్నారు. నాట్య ప్రదర్శనతో అలరించిన ఎమ్మెల్యే రోజాను గవర్నర్ అభినందించి, జ్ఞాపికను బహుకరించారు.