వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం..ఎందుకంటే..?
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాలాభిషేకం చేశారు ముస్లింలు. ఆనంతరం వారి ఆచారాల ప్రకారం ఆయనను సన్మానించారు. ఎన్పీఆర్కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ తీర్మానం చేయడంతో పాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. వారు ఈ విధంగా కృతజ్ఞత తెలిపారు. ఇక సీఎం జగన్తో పాటు మాజీ సీఎం వైఎస్సార్ చిత్రపటాలకు సైతం ఎమ్మెల్యేతో కలిసి పాలాభిషేకం చేశారు ముస్లింలు. ముఖ్యమంత్రి జగన్ అండదండలతో, మంత్రి అనిల్ కుమార్ […]
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాలాభిషేకం చేశారు ముస్లింలు. ఆనంతరం వారి ఆచారాల ప్రకారం ఆయనను సన్మానించారు. ఎన్పీఆర్కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ తీర్మానం చేయడంతో పాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. వారు ఈ విధంగా కృతజ్ఞత తెలిపారు. ఇక సీఎం జగన్తో పాటు మాజీ సీఎం వైఎస్సార్ చిత్రపటాలకు సైతం ఎమ్మెల్యేతో కలిసి పాలాభిషేకం చేశారు ముస్లింలు. ముఖ్యమంత్రి జగన్ అండదండలతో, మంత్రి అనిల్ కుమార్ సహకారంతో ఎన్పీఆర్పై పోరాటం పలించిందన్నారు కోటంరెడ్డి. కాగా ఇటీవలే కోటంరెడ్డి ఎన్పీఆర్కి వ్యతిరేకంగా నెల్లూరులో భారీ సభను ఏర్పాటు చేశారు.