రంగంలోకి దిగుతున్న షర్మిల..
వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు షర్మిలను ప్రచారంలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనునంది షర్మిల. ముందుగా మంగళగిరిలో జరగబోయే సభలో పాల్గొంటుంది. నేటి నుంచి ప్రచారంలోకి దిగడంతో వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సామం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి నుంచి బస్సు యాత్ర […]
వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు షర్మిలను ప్రచారంలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనునంది షర్మిల. ముందుగా మంగళగిరిలో జరగబోయే సభలో పాల్గొంటుంది. నేటి నుంచి ప్రచారంలోకి దిగడంతో వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సామం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనున్న షర్మిల.. గుంటూరు, కృష్ణాతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే.. టీడీపీ బలంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లోనూ షర్మిల ప్రచారం ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది వైసీపీ.