ఏపీలో కొత్త ఇన్చార్జి మంత్రులు ..వారికి దక్కని ఛాన్స్
13 జిల్లాలకు కొత్తగా ఇన్చార్జి మంత్రులను నియమించింది ఏపీ ప్రభుత్వం . వీరిలో ఒక్క మహిళా మంత్రికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు. జగన్ కేబినెట్లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళా మంత్రులు కూడా ఉన్నారు. సీఎం జగన్ సారధ్యంలోని ప్రభుత్వ పథకాలు ఆయా జిల్లాలో ఏ మేరకు అమలవుతున్నాయనే దానిపై ఇన్చార్జి మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. […]
13 జిల్లాలకు కొత్తగా ఇన్చార్జి మంత్రులను నియమించింది ఏపీ ప్రభుత్వం . వీరిలో ఒక్క మహిళా మంత్రికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు. జగన్ కేబినెట్లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళా మంత్రులు కూడా ఉన్నారు. సీఎం జగన్ సారధ్యంలోని ప్రభుత్వ పథకాలు ఆయా జిల్లాలో ఏ మేరకు అమలవుతున్నాయనే దానిపై ఇన్చార్జి మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో ఈ మంత్రులు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఇదిలా ఇన్చార్జి మంత్రుల్లో మహిళా మంత్రులకు చోటు దక్కలేదు. ఇప్పటికే సీఎం జగన్ కేబినెట్లో మేకతోటి సుచరిత (హోంమంత్రి), పాముల పుష్పశ్రీవాణి (ఉప ముఖ్యమంత్రి), తానేటి వనిత (మహిళా శిశు సంక్షేమం) మంత్రులుగా ఉన్నారు. వీరితో పాటు పలువురు మంత్రులకు కూడా ఛాన్స్ దక్కలేదు.
ఏపీ ఇన్చార్జి మంత్రులు ఎవరంటే..!
శ్రీకాకుళం – కొడాలి నాని , విజయనగరం – వెల్లంపల్లి శ్రీనివాసరావు,పశ్చిమ గోదావరి – పేర్ని నాని, కృష్ణా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గుంటూరు – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ప్రకాశం – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,నెల్లూరు – బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు – అనిల్ కుమార్, కడప – ఆదిమూలపు సురేష్, అనంతపురం – బొత్స సత్యనారాయణ, చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డిలు ఇన్చార్జి మంత్రులుగా నియమితులయ్యారు.