రాంచీ ఖాకీలు ఇది మీకు తగునా..?.. యువకుడిని కొట్టి.. అలా తాగిస్తారా..?
ప్రస్తుతం కరోనా వ్యాప్తితో దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎమర్జెన్సీలకు సంబంధించిన సర్వీసులకు ఈ లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొందరు రోడ్ల పైకి యథేచ్చగా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చితకబాదుతూ.. ఇంటికే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన పోలీస్ డిపార్ట్ మెంట్కు తలవంపుగా మారింది.రాంచీకి చెందిన పోలీసుల ఓవరాక్షన్.. అంతలా ఉంది. లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చాడని […]
ప్రస్తుతం కరోనా వ్యాప్తితో దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎమర్జెన్సీలకు సంబంధించిన సర్వీసులకు ఈ లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొందరు రోడ్ల పైకి యథేచ్చగా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చితకబాదుతూ.. ఇంటికే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన పోలీస్ డిపార్ట్ మెంట్కు తలవంపుగా మారింది.రాంచీకి చెందిన పోలీసుల ఓవరాక్షన్.. అంతలా ఉంది. లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చాడని ఓ యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అతడిచేత మూత్రాన్ని కూడా తాగించారట.
ఈ ఘటన రాంచీ పట్టణంలో కలకలం రేపింది. హింద్పిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ చిరువ్యాపారిగా బాధితుడిని గుర్తించారు. పోలీసులు అతడిని కొడుతున్న సమయంలో కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ సన్నివేశాలు వైరల్గా మారాయి. కొట్టొద్దంటూ యువకుడు ఎంత ప్రాధేయపడినా.. పోలీసులు కనికరం చూపకుండా.. చితకబాదారు. దీంతో ప్రజలు సదరు పోలీసులపై కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ.. హింద్పిరి పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసి.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.