న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. తెలుగు యువకుల అనుమానాస్పద మృతి
గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాయి ప్రసాద్, వెంకట్ అనే సంగీత ప్రియులు ఇద్దరు యువకులు గోవాలో జరిగే సన్బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఉన్నట్లుండి ఆ వేడుక జరుగుతున్న వేదిక వద్దే వారిద్దరు కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. మార్గమధ్యంలోనే వారిద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వేదిక ప్రదేశంలో శుక్రవారం మధ్యాహ్నం ఆ ఇద్దరు ఇబ్బందిగా […]
గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సాయి ప్రసాద్, వెంకట్ అనే సంగీత ప్రియులు ఇద్దరు యువకులు గోవాలో జరిగే సన్బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఉన్నట్లుండి ఆ వేడుక జరుగుతున్న వేదిక వద్దే వారిద్దరు కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. మార్గమధ్యంలోనే వారిద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వేదిక ప్రదేశంలో శుక్రవారం మధ్యాహ్నం ఆ ఇద్దరు ఇబ్బందిగా కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. కాసేపట్లో సాయి ప్రసాద్, వెంకట్ మృతదేహాలకు పోస్ట్మార్టం చేయించనున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఏపీ పోలీసులకు వారు సమాచారం అందించారు. అయితే డ్రగ్స్ డోస్ ఎక్కువకావడం వల్ల గానీ.. లేక హార్ట్ ఎటాక్ రావడం వలన కానీ వీరిద్దరు మరణించి ఉంటారని గోవా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.