మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి.. అసలు కారణం ఏమై ఉంటుంది..?

హైదరాబాద్ మహానగర శివారులో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి.. అసలు కారణం ఏమై ఉంటుంది..?
Follow us

|

Updated on: Nov 13, 2020 | 3:36 PM

హైదరాబాద్ మహానగర శివారులో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మెషావాడకు చెందిన అప్పారావు కుమారుడు థామ్స్‌(25) జీడిమెట్ల వెంకటేశ్వరా ఎన్‌క్లేవ్‌లోని రాజరాజేశ్వరీ వసతి గృహంలో ఏడు నెలలుగా నివాసముంటున్నాడు. స్థానికంగా ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి బయట నుంచి కర్రీ, కల్లు తెచ్చుకుని, వసతి గృహంలో భోజనం తీసుకుని గదిలోకి వెళ్లాడు. కొద్ది సేపటికి మూడో అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందాడు. హాస్టల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.