Yes Bank Fraud: కాంగ్రెస్ మెడకు ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ ? రాణా తెచ్చిన ట్రబుల్ !

Yes Bank Fraud:  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్ కి అమ్మిన పెయింటింగ్.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటాన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రపటాన్ని  తాను రూ. 2 కోట్లకు కపూర్ కి అమ్మినట్టు ప్రియాంక గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని విషయమై ఈడీ అధికారులు త్వరలో ఆమెకు సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..  సిమ్లా దగ్గరి ఆమె కాటేజీని వారు ఎటాచ్ (స్వాధీనం) చేసుకోనున్నారని సమాచారం. […]

Yes Bank Fraud: కాంగ్రెస్ మెడకు ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ ? రాణా తెచ్చిన ట్రబుల్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 10, 2020 | 4:10 PM

Yes Bank Fraud:  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్ కి అమ్మిన పెయింటింగ్.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటాన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రపటాన్ని  తాను రూ. 2 కోట్లకు కపూర్ కి అమ్మినట్టు ప్రియాంక గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని విషయమై ఈడీ అధికారులు త్వరలో ఆమెకు సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..  సిమ్లా దగ్గరి ఆమె కాటేజీని వారు ఎటాచ్ (స్వాధీనం) చేసుకోనున్నారని సమాచారం. ప్రియాంక తండ్రి రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఆమె నుంచి కొనుగోలు చేయవలసిందిగా కాంగ్రెస్ నేత, దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవర తనపై ఒత్తిడి తెచ్చారని రాణాకపూర్ గత ఆదివారం ఈడీ అధికారులకు ఇఛ్చిన వాంగ్మూలంలో తెలిపారు. యాంటీ మనీ లాండరింగ్ చట్టం కింద.. ఎస్ బ్యాంక్ స్కామ్ లో నిందితుడైన కపూర్ నుంచి సొమ్ము తీసుకుని.. దాన్ని సిమ్లా సమీపంలోని తన కాటేజీ కోసం ప్రియాంక వినియోగించుకోవడం ‘ప్రోసీడ్స్ ఆఫ్ క్రైమ్’ కిందికి వస్తుందని ఈడీ భావిస్తోంది. అంటే ఆ ఆస్తిని ఎటాచ్ చేసుకోవడానికి అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మిలింద్ దేవరను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించవచ్ఛు. అయితే ప్రియాంక చర్య చట్ట సమ్మతమైనదేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ చిత్రపటాన్ని రెండు కోట్లకు కొనుగోలు చేసిన విషయాన్ని ఆమె దాచిపెట్టలేదని, 2010 లో తాను దాఖలు చేసిన ఇన్ కమ్ టాక్స్ రిటర్నులలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆ చిత్రపటాన్ని ఎటాచ్ చేసిన ఈడీ

రాణాకపూర్ కు ప్రియాంక అమ్మిన రాజీవ్ గాంధీ పెయింటింగును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని కపూర్ నివాసం నుంచి దాన్ని ఎటాచ్ చేశారు. 1985 లో ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ వేసిన ఈ పెయింటింగును కాంగ్రెస్ శతాబ్ది వేడుకల సమయంలో ప్రియాంక తండ్రి రాజీవ్ గాంధీకి బహుకరించారు. ఆ తరువాత 2010 లో దీన్ని ప్రియాంక.. కపూర్ కి రెండు కోట్లకు అమ్మారు.  అప్పట్లో ఆయనకు ఆమె ఓ లేఖ రాస్తూ.. ‘ మా నాన్నగారి చిత్రపటాన్ని కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలని, నాడు ఎం.ఎఫ్ హుసేన్ వేసిన ఈ చిత్రపటం తనవద్ద ఉండడం తనకెంతో ఆనందదాయకమని’ పేర్కొన్నారు. కాగా-ఇదే సమయమని బీజేపీ.. ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేస్తూ.. దేశంలో ఏ నేర సంబంధ ఘటన జరిగినా దాని మూలాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయంటూ ధ్వజమెత్తింది.

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!