ఎస్ బ్యాంక్ క్రైసిస్.. పెట్రోల్ బంక్ యజమానులకు తప్పని కష్టాలు

ఎస్ బ్యాంక్ సంక్షోభంతో పెట్రోలు బంకుల యజమానులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ బ్యాంకు నెలవారీ విత్ డ్రాలు ఒక్కో ఖాతాకు రూ. 50 వేలు మించకూడదని రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించడం వీరి పాలిట 'శాపం'గా మారింది. 

ఎస్ బ్యాంక్ క్రైసిస్.. పెట్రోల్ బంక్ యజమానులకు తప్పని కష్టాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2020 | 5:51 PM

ఎస్ బ్యాంక్ సంక్షోభంతో పెట్రోలు బంకుల యజమానులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ బ్యాంకు నెలవారీ విత్ డ్రాలు ఒక్కో ఖాతాకు రూ. 50 వేలు మించకూడదని రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించడం వీరి పాలిట ‘శాపం’గా మారింది.  ఎస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్న పెట్రోల్ బంక్ ఓనర్స్ ఈ నిషేధం కారణంగా ఆయిల్ కంపెనీలకు చెల్లింపులు జరపలేకపోతున్నారు. వీరిలో చాలామందికి కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. ప్రతి యజమాని రోజుకు రూ.30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఆయిల్ కంపెనీలకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్ బ్యాంక్ క్రైసిస్ అనంతరం వీరు తమ డెయిలీ బకాయిలను క్లియర్ చేయలేకపోతున్నారు. తమ బంకుల్లో వీరికి సాధారణంగా పెట్రోలు స్టాక్ నాలుగు లేదా ఐదు రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఎంతకాలం  సర్దుబాటు చేసుకోగలుతామో వీరికి తెలియకుండా ఉంది.

సుమారు 15 పెట్రోలు బంకుల యజమానులు పూర్తిగా తమ ఎస్ బ్యాంకు ఖాతాలపై ఆధారపడి ఉన్నారని ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ బ్యాంకు 2015 లో ‘బంచ్ నోట్ యాక్సెస్టర్’ (బీ ఎన్ఏ) మెషిన్లను ప్రవేశ పెట్టడంతో ఈ యజమానులంతా ఈ ఆప్షన్ ను ఎంచుకున్నారు. ఈ మెషిన్ల ద్వారా వీరు ప్రతి రోజు బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండానే భారీ మొత్తాలను డిపాజిట్ చేయగలుగుతున్నారు. (ఎస్ బ్యాంకు మాత్రమే ఈ వెసులుబాటును ఇచ్చింది). కాగా-తాజాగా నెలకొన్న సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియక ఈ బంకుల యజమానులంతా తలలు పట్టుకుంటున్నారు.