భారత్‌ కోసం ఇజ్రాయెల్ స్నేహగీతం!

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మన బలమైన స్నేహం, పెరుగుతోన్న భాగస్వామ్యం మరింతగా ఎదగాలని నెతన్యాహూ ఆకాక్షించారు. మోదీ, నెతన్యాహూ కలిసి ఉన్న ఫొటోలను భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలను వీడియోలుగా కూర్చి.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘షోలే’ సినిమాలోని ‘‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే..’’ అనే మ్యూజిక్‌ను బ్యాక్‌గ్రౌండ్లో ప్లే చేశారు. గత నెలలో […]

భారత్‌ కోసం ఇజ్రాయెల్ స్నేహగీతం!
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 4:55 PM

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మన బలమైన స్నేహం, పెరుగుతోన్న భాగస్వామ్యం మరింతగా ఎదగాలని నెతన్యాహూ ఆకాక్షించారు. మోదీ, నెతన్యాహూ కలిసి ఉన్న ఫొటోలను భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలను వీడియోలుగా కూర్చి.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘షోలే’ సినిమాలోని ‘‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే..’’ అనే మ్యూజిక్‌ను బ్యాక్‌గ్రౌండ్లో ప్లే చేశారు.

గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నికల ప్రచారంలోనూ టెల్ అవివ్‌లోని ఓ బిల్డింగ్‌ బయట.. మోదీతో నెతన్యాహూ కరచలనం చేస్తున్న ఫొటోను వేలాడదీశారు. నెతన్యాహూ ఇజ్రాయెల్‌కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. కానీ ఇటీవల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో సెప్టెంబర్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలకు 8 రోజుల ముందే ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్ అంశంపై తేల్చేయాలని కేంద్రం భావిస్తోన్న తరుణంలో భారత్‌ కోసం ఇజ్రాయెల్ ఇలా స్నేహగీతం ఆలపించడం గమనార్హం.