కుప్పంలో చంద్రబాబుకు పొగ: వైసీపీ యాక్షన్ ప్లాన్

సుదీర్ఘ కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చెక్ పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది. ఈ టాస్క్‌ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పడు ఆ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై మంత్రి పెద్దిరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిని […]

కుప్పంలో చంద్రబాబుకు పొగ: వైసీపీ యాక్షన్ ప్లాన్
Follow us

|

Updated on: Feb 05, 2020 | 4:01 PM

సుదీర్ఘ కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చెక్ పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది. ఈ టాస్క్‌ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం.

కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పడు ఆ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై మంత్రి పెద్దిరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిని బయట పెట్టడమే టార్గెట్‌గా కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రామకుప్పం మండలంలో సామాజిక తనిఖీలకు తెరలేపారు మంత్రి. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన సోషల్ ఆడిట్‌లో 8 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కోటి 40 లక్షల రూపాయలు దుర్వనియోగం జరిగిందంటూ ఆ మొత్తం రికవరీకి ఆదేశాలు జారీ చేశారు.

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అయిదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఉపాధి పనులు చేసిందంతా టిడిపి మద్దతుదారులే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు హయాంలో జరిగిన పనులన్నింటిలోనూ అవినీతి సొమ్మును కక్కిస్తామమని కుప్పం వైసిపినేతలు ప్రతిఙ్ఞలు చేస్తున్నారు. ఇప్పటికే ఎకో టూరిజం పనుల్లో 4 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ పనులు నిలిపి వేసింది ప్రభుత్వం. వాటికి చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలిపి వేశారు.

గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేసిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల సిసి రోడ్డు పనులు, నీరు చెట్టు కింద చేపట్టిన పనులపైనా విచారణ జరిపిస్తున్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ కావడంతో విచారణకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతోంది.

అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్యాడర్‌ను ఇరుకున పెట్టేందుకే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టిడిపి నేతలంటున్నారు. వైసిపి కుట్రలకు బెదిరేది లేదని, చిన్నపాటి వ్యవహారాలతో చంద్రబాబుకు చెక్ పెట్టాలనుకుంటే అవి పగటి కలలేనని కామెంట్ చేస్తున్నారు టిడిపి నేతలు.

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు