ఎగ్జిట్ పోల్స్‌ని గుడ్డిగా నమ్మలేం..!

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నేత రోజా స్పందించారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. వ్యక్తిగతంగా ఇటువంటి సర్వేలను తాను విశ్వసించనని తేల్చి చెప్పారు. కానీ.. 100 శాతం ఖచ్చితంగా ఏపీకి జగన్‌నే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్తున్నారు. పాదయాత్రలో, పలు బహిరంగ సభల్లో ప్రజల్లో జగన్‌కు ఉన్న విశ్వసనీయతను చూశామని, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో వాళ్లున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం అప్పుడే వేరు పడిందని.. […]

ఎగ్జిట్ పోల్స్‌ని గుడ్డిగా నమ్మలేం..!
Follow us

| Edited By:

Updated on: May 20, 2019 | 12:08 PM

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నేత రోజా స్పందించారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. వ్యక్తిగతంగా ఇటువంటి సర్వేలను తాను విశ్వసించనని తేల్చి చెప్పారు. కానీ.. 100 శాతం ఖచ్చితంగా ఏపీకి జగన్‌నే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్తున్నారు. పాదయాత్రలో, పలు బహిరంగ సభల్లో ప్రజల్లో జగన్‌కు ఉన్న విశ్వసనీయతను చూశామని, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో వాళ్లున్నారని తెలిపారు.

గత ఎన్నికల్లో రాష్ట్రం అప్పుడే వేరు పడిందని.. జగన్ ఏం చేయలేరని.. చంద్రబాబుకి ఓట్లు వేసి గెలిపిస్తే.. ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు రోజా. జగన్‌ను గెలిపిస్తే మళ్లీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. మాకు అనుకూలంగా లేని పోల్స్ గురించి మేము డల్ అయిపోమని అన్నారు. జగన్ సీఎం అవుతారని.. మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెప్పారు.