ఇక చంద్రబాబు నెక్ట్స్ మాటలు ఇవే.. వైసీపీ ఎంపీ జోస్యం..!
ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీపై సెటైర్లు వేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్లో విమర్శలను గుప్పించారు. ఏపీలో అద్భుతంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, […]
ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీపై సెటైర్లు వేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్లో విమర్శలను గుప్పించారు. ఏపీలో అద్భుతంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, పిల్లల దగ్గర చాక్కెట్లు లాక్కుంటున్నారనో అనడం గ్యారంటీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. స్త్రీ జాతినే అవమానించినోడికి ఇటువంటివో లెక్కా అంటూ ట్వీట్ చేశారు.
ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, పిల్లల దగ్గర చాక్కెట్లు లాక్కుంటున్నారనో అనడం గ్యారంటీ. స్త్రీ జాతినే అవమానించినోడికి ఇటువంటివో లెక్కా.@ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2019
ఐదేళ్ల పదవీ కాలంలో తన పార్టీకి నిధులు సమకూర్చే బడా కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచి పెట్టాడని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ఇంటికో ఉద్యోగమని మోసం చేసి ఎన్నికల ముందు వెయ్యి పెన్షన్ చేతిలో పెట్టాడని.. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ల బకాయిల గురించి ఆందోళన చెందుతున్నాడు తప్ప.. ప్రజల సాధక బాధల గురించి మాట్లాడడం లేదని చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఐదేళ్ల పదవీ కాలంలో తన పార్టీకి నిధులు సమకూర్చే బడా కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచి పెట్టాడు. ఇంటికో ఉద్యోగమని మోసం చేసి ఎన్నికల ముందు వెయ్యి పెన్షన్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ల బకాయిల గురించి ఆందోళన చెందుతున్నాడు తప్ప ప్రజల సాధక బాధల గురించి మాట్లాడడు. @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2019