బయటకొచ్చి మాట్లాడు చిట్టీ.. అంతా వెయిటింగ్ అంటూ..
విజయసాయి రెడ్డి.. ట్విట్టర్ను ఎలా వాడతారో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ.. ట్విట్లతోనే సెటైర్లు వేస్తూ.. పవర్ పంచ్లు వేస్తుంటారు.
విజయసాయి రెడ్డి.. ట్విట్టర్ను ఎలా వాడతారో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ.. ట్విట్లతోనే సెటైర్లు వేస్తూ.. పవర్ పంచ్లు వేస్తుంటారు. ముఖ్యంగా టీడీపీని అందున చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ నిత్యం ట్వీట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా నారా లోకేష్ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండ్రి అధికారం పోయింది. ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా రేపోమాపో పొతుందంటూ లోకేష్ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు.
“తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 1, 2020