నిజమే.. బాబు రావాలని ఆ ప్రజలంతా కోరుకుంటున్నారు..!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేధికగా చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపించారు. గత కొద్ది రోజులుగా ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేధికగా వార్ తీవ్రస్థాయిలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు తిరిగి తాను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఓ పర్యటనలో భాగంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ శ్రేణులు […]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేధికగా చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపించారు. గత కొద్ది రోజులుగా ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేధికగా వార్ తీవ్రస్థాయిలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఇటీవల చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు తిరిగి తాను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఓ పర్యటనలో భాగంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ శ్రేణులు గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చాయి. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి కౌంటర్ ఎటాక్ చేశారు. తాజాగా వెలువడిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ చంద్రబాబుకు ట్వీట్ చేశారు. మళ్లీ మీరే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చంద్రబాబు గారు కలవరిస్తున్నారని.. ఆ మాట నిజమేనంటూ ట్వీట్ చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమేనంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అక్కడ పోలైన ఓట్లలో ఒక శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
మళ్లీ తనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు @ncbn గారు కలవరిస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమే. పోలైన ఓట్లలో ఒక శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 26, 2019