పరిటాల శ్రీరామ్పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన గోరంట్ల మాదవ్..
అనంతపురం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శ్రీరామ్ ప్రజలను రెచ్చగోడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఏ మాత్రం సహించేది లేదన్నారు. రాప్తాడులో గెలవలేకే ప్రత్యర్ధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక రామగిరిలో పరిటాల శ్రీరామ్ అరాచకాలు గమనించాలని… ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఎంపీడీవో కాలర్ని టీడీపీ నేతలు పట్టుకున్నారని […]
అనంతపురం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శ్రీరామ్ ప్రజలను రెచ్చగోడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఏ మాత్రం సహించేది లేదన్నారు. రాప్తాడులో గెలవలేకే ప్రత్యర్ధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇక రామగిరిలో పరిటాల శ్రీరామ్ అరాచకాలు గమనించాలని… ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఎంపీడీవో కాలర్ని టీడీపీ నేతలు పట్టుకున్నారని ఆరోపించారు. తక్షణమే పరిటాల శ్రీరామ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.