చంద్రబాబు సార్ చేసిన ఆ చివరి.. తప్పు అదే..!
మరికొన్ని రోజుల్లో తన సీఎం పదవిని పోగొట్టుకోనున్న సీఎం చంద్రబాబు గారు.. ఘోర తప్పులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. మరోసారి తన ట్వీట్తో ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. ”చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సీఎస్ సుబ్రమణ్యం గారిని దూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది చంద్రబాబు సారుకు.. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు […]
మరికొన్ని రోజుల్లో తన సీఎం పదవిని పోగొట్టుకోనున్న సీఎం చంద్రబాబు గారు.. ఘోర తప్పులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. మరోసారి తన ట్వీట్తో ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. ”చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సీఎస్ సుబ్రమణ్యం గారిని దూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది చంద్రబాబు సారుకు.. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాత బాబును వెంటాడుతాయి.”
అలాగే.. ”మా పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు..? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు. అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ పెద్ద పాలేరులా అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదెందుకో?” అని ట్విట్టర్లో ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.
చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 30, 2019
మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు. అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ పెద్ద పాలేరులా అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదెందుకో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 30, 2019