కన్నుల పండుగగా లక్ష్మీనారసింహుని కళ్యాణం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని తిరు కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. భక్తుల నామస్మరణతో యాదాద్రి కొండ మార్మోగింది. యాదాద్రి బాలాలయంలోని, కొండ కింద జెడ్పీ హైస్కూల్ ఆవరణలోనూ శుక్రవారం శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని తిరు కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. భక్తుల నామస్మరణతో యాదాద్రి కొండ మార్మోగింది. యాదాద్రి బాలాలయంలోని, కొండ కింద జెడ్పీ హైస్కూల్ ఆవరణలోనూ శుక్రవారం శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.