Yadadri works: చివరి దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పనులు.. భక్తుల దర్శనానికి అనుమతి ఎప్పుడో తెలుసా..
యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్ప సౌందర్యంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా
Yadadri works: యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్ప సౌందర్యంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పుణ్యక్షేత్రం సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ మధ్య అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగుతాయి. దీంతో ఆ సమయానికి ముందే ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుండగా, గర్భగుడిలో మాత్రం స్వామివారికి నిరంతరం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 16న వసంత పంచమి, 18న రథ సప్తమి నేపథ్యంలో ఆ ముహూర్తాల్లోనే ప్రారంభం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ని సంప్రదించి చినజీయర్ స్వామి సలహా మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.