అయోధ్యకు వెళ్తా, కానీ ప్రధాని మోదీ గురించే ఆందోళన, ఉమాభారతి

అయోధ్యలో ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి తాను వెళ్తానని, కానీ ఆ సమయానికి అక్కడ ఉండనని బీజేపీ నాయకురాలు ఉమాభారతి తెలిపారు.

అయోధ్యకు వెళ్తా, కానీ ప్రధాని మోదీ గురించే ఆందోళన, ఉమాభారతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 03, 2020 | 11:13 AM

అయోధ్యలో ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి తాను వెళ్తానని, కానీ ఆ సమయానికి అక్కడ ఉండనని బీజేపీ నాయకురాలు ఉమాభారతి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన అనంతరం తను ఆ ప్రదేశాన్ని సందర్శిస్తానన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కోవిడ్-19 బారిన పడడం తనకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న ఆమె.. అయోధ్యలో జరిగే ఈవెంట్ కి వేలాది మంది హాజరవుతున్న దృష్ట్యా.. ప్రధాని మోదీ గురించిన చింత తనకు ఉందన్నారు. ఆ సమయానికి నేను సరయు నదీ తీరాన ఉంటానని ఉమాభారతి తెలిపారు.

భూమి పూజకు  నేను అటెండ్ కావడంలేదు గనుక గెస్ట్ లిస్ట్ నుంచి నాపేరు తొలగించండి అని ఉమాభారతి… అయోధ్య ట్రస్ట్ నిర్వాహకులను కోరారు.