81 లక్షలకు చేరువలో కేసులు.. టెర్రర్ పుట్టిస్తోన్న కరోనా..
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సోమవారం 123631 కొత్త కేసులు రావడంతో..
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సోమవారం 123631 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 8107698కి చేరాయి. అలాగే నిన్న 3399 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,38,580కి చేరింది. ఇక ప్రస్తుతం 3480984 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4188134గా ఉంది.
ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. నిన్న కొత్తగా 20489 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2182717కి చేరాయి. అలాగే నిన్న 421 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 118279కి చేరింది. ఇక ఓవరాల్గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కాగా ప్రపంచానికి కరోనాని పరిచయం చేసిన చైనాలో కూడా ఇప్పుడు మళ్లీ కోవిడ్ వ్యాప్తి చెందుతుంది. తాజాగా బిజింగ్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా భారత్లో 11502 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 332424కు చేరుకుంది. ఇందులో యాక్టీవ్ కేసుల సంఖ్య 153106గా ఉంది. కాగా కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారు 169798 మంది ఉన్నారు. ఇక దేశం మొత్తం 9520 మంది కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం వ్యాధి నుంచి రికవరీ రేటు 51.1శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. కాగా ప్రజంట్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
Read More:
వాహనదారులపై అధిక భారం.. చమురుధరలపై రూ.2 పెంపు..