Russia – Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన ప్రకటన చేసిన ఆ ముగ్గురు దేశాధినేతలు..!
Russia - Ukraine: యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్కు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సంఘీభావం ప్రకటించాయి. ఈ మూడు దేశాల అధ్యక్షులు కలసి ఉక్రెయిన్లో
Russia – Ukraine: యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్కు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సంఘీభావం ప్రకటించాయి. ఈ మూడు దేశాల అధ్యక్షులు కలసి ఉక్రెయిన్లో పర్యటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అధినేతలు మాక్రాన్, షోల్జ్, ద్రాగి.. ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ ముగ్గురు దేశాధినేతలు ముందుగా ఉక్రెయిన్లోని రష్యా దాడులతో రూపురేఖలు కోల్పోయిన ఇర్పిన్ ప్రాంతాన్ని సందర్శించారు. రష్యా దాడులతో అక్కడ శిథిమైన భవనాలను, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత రాజధాని కీవ్కి వెళ్లి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీతో చర్చలు జరిపారు.
పోలాండ్ నుంచి 10 గంటలు రైలులో ప్రయాణించి కీవ్ చేరుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. యూరోపియన్ ఐక్యత, ఉక్రెయిన్కు మద్దతుపై మెసేజ్ ఇవ్వడానికే వచ్చానని చెప్పారు మాక్రాన్. ఉక్రెయిన్ ఈ యుద్ధం గెలవాలని ఆకాంక్షించారు. రష్యాను అవమానించడం కరెక్ట్ కాదని గతంలో కామెంట్ చేసిన మాక్రాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో ఎలాంటి సందిగ్ధం లేకుండా ప్రకటన చేశారు మాక్రాన్. అలాగే ఉక్రెయిన్కు సంఘీభావం తెలుపడానికే వచ్చామని జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ కూడా వస్తూ వస్తూ ట్రైన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా విషయంలో జర్మనీపై విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక, మానవీయ సాయంతో పాటు ఉక్రెయిన్ స్వాతంత్ర్యం కోసం అవసరమైనంత వరకు ఆయుధాలు కూడా సరఫరా చేస్తామన్నారు.
మిగతా యూరోపియన్ నాయకుల మాదిరిగానే మాక్రాన్, షోల్జ్, ద్రాగి కూడా కీవ్ శివారులోని ఇర్పిన్ వీధుల్లో కలియతిరిగి బాంబు దాడుల్లో నామరూపాలు లేకుండా పోయిన భవనాల ముందు ఆగి పరిశీలించారు. వాటి గురించి గైడ్లను ప్రశ్నలు అడిగారు. తర్వాత రాజధాని నగరం కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై వారు చర్చించారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ చిన్న దేశమే అయినా రష్యాను ప్రతిఘటిస్తూ వస్తోంది. 20 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా చేతిలో ఉందని ఇటీవలే జెలన్ స్కీ చెప్పారు.