కాంచనగంగ పర్వతారోహణలో విషాదం.. ఇద్దరు భారతీయులు మృతి
ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన పర్వతమైన కాంచనగంగ పర్వతారోహణలో విషాదం చోటుచేసుకుంది. నేపాల్ లో గల ఈ పర్వతాన్ని అధిరోహిద్దామనుకుని వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన బుధవారం నాడు జరిగింది. మృతులిద్దరూ కోల్కతా వాసులుగా గుర్తించారు. బిప్లబ్ బైద్య, కుంతల్ కన్రార్ అనే ఇద్దరు కాంచనగంగా పర్వతాన్ని ఎక్కారు. అయితే 8వేల మీటర్ల ఎత్తులో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన పర్వతమైన కాంచనగంగ పర్వతారోహణలో విషాదం చోటుచేసుకుంది. నేపాల్ లో గల ఈ పర్వతాన్ని అధిరోహిద్దామనుకుని వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన బుధవారం నాడు జరిగింది. మృతులిద్దరూ కోల్కతా వాసులుగా గుర్తించారు. బిప్లబ్ బైద్య, కుంతల్ కన్రార్ అనే ఇద్దరు కాంచనగంగా పర్వతాన్ని ఎక్కారు. అయితే 8వేల మీటర్ల ఎత్తులో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.