Saudi Arabia: సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటేనే మక్కాలోకి అనుమతి
Saudi Arabia: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది...
Saudi Arabia: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రంజాన్ మాసం మొదలైన నాటి నుంచి ఇమ్యూనిటీ కలిగి ఉన్న వారు మాత్రమే ఉమ్రా తీర్థయాత్ర చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, గడిచిన 14 రోజుల్లో ఒక డోసు తీసుకున్న వారు లేదా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు మాత్రమే ఉమ్రా యార్థ చేసేందుకు అనుమతి ఉంటుందని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. మక్కా మసీదులో జరిగే ప్రార్థనలలో పాల్గొనే వారికి కూడా ఇవే నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది.
ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయనేదానిపై ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. హజ్ యాత్ర వరకు ఇవే ఆంక్షలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం యాత్రకు కేవలం పది వేల మంది మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఎంతమందికి అనుమతిస్తుందో వేచి చూడాలి. 2019లో హజ్ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మంది ముస్లింలు వెళ్లారు. సౌదీలో ఇప్పటి వరకు 3.93 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 6,700 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటి వరకు సౌదీలో 50 లక్షలకుపైగా మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా… గత రెండు నెలల నుంచి మళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
వీ చదవండి: Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ
జోర్డాన్ రాజ కుటుంబంలో ముసలం.. దేశద్రోహం కేసులో గృహ నిర్బంధంలో మాజీ యువరాజు..!
Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!