Shocking: పబ్‌జీ ఆడి.. ఆడి పిచ్చెక్కింది.. తల్లి, ముగ్గురు తోబుట్టువులను పిట్టల్లా కాల్చేశాడు

పబ్‌జీ ఆటకు బానిసైన పద్నాలుగేళ్ల బాలుడు తల్లిని, ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో గత వారం ఈ దారుణ ఘటన జరిగింది.

Shocking: పబ్‌జీ ఆడి.. ఆడి పిచ్చెక్కింది.. తల్లి, ముగ్గురు తోబుట్టువులను పిట్టల్లా కాల్చేశాడు
Pubg Addiction
Follow us

|

Updated on: Jan 29, 2022 | 1:20 PM

PUBG Addiction: పబ్​జీ గేమ్ ఇంకా యువత జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మర్చిపోయి గంటలపాటు గేమ్ ఆడుతూ ప్రజంట్ యూత్ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ గేమ్ కారణంగా కొన్ని వివాహ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అనేకమంది మానసిక స్థితి కోల్పోయి ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. తాజాగా పబ్​జీ కారణంగా నాలుగు ప్రాణాలు బలయ్యాయి. ఒక బాలుడు జువైనల్ హోమ్ కు వెళ్లాల్సి వచ్చింది. పబ్‌జీ ఆటకు బానిసైన పద్నాలుగేళ్ల బాలుడు తల్లిని, ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్థాన్‌(Pakistan)లోని పంజాబ్‌ ప్రావిన్సులో గత వారం ఈ దారుణ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌(Lahore)లోని కహ్నాకు చెందిన బాలుడు పబ్‌జీ ఆటకు బాగా అడిక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే.. ఆ గేమ్ ఆడి.. ఆడి అతడికి మానసిక సమస్యలు తలెత్తాయి. కాగా  పదే, పదే గేమ్‌ ఆడుతూ.. చదువుపై ధ్యాస పెట్టడం లేదంటూ.. తల్లి నహీద్‌ ముబారక్‌ (45) ఇటీవల కొడుకుని మందలించింది.

దీంతో బాలుడు అదేరోజు రాత్రి కప్‌బోర్డులో ఉన్న గన్ తీసుకొని తల్లిని, సోదరుడ్ని సహా  అక్కాచెల్లెళ్లను కాల్చి చంపాడు.  మరుసటిరోజు ఉదయం ఇంట్లో డెడ్ బాడీలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తనకేం తెలీదని.. డాబాపై నిద్రించినట్లు తొలుత బాలుడు బుకాయించాడు. పోలీసుల తమదైన స్టైల్లో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కాగా ఇంట్లోకి తుపాకీ ఎలా వచ్చిందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు. భర్త నుంచి విడాకులు తీసుకొని ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తల్లి కుటుంబ రక్షణ కోసం కొంతకాలం క్రితం తీసుకున్నదని గుర్తించారు.

Also Read: ఆ ప్రాంతంలో మామిడి, జామచెట్లకు గుమ్మడికాయలు.. ఈ విచిత్రం వెనుక సీక్రెట్ ఇదే..

ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. నేడు అధికారిక ప్రకటన