పాక్ చెరలో 34 మంది భారత మత్స్యకారులు
కరాచీ: భారత్కు చెందిన 34 మంది మత్స్యకారులను పాక్ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న 60 మందిని విడుదల చేసిన 10 రోజుల వ్యవధిలోనే పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో మరో 34 మందిని అరెస్టు చేసింది. జనవరిలో గుజరాత్కు చెందిన ఐదుగురు పడవలు నడిపే వారిని నిర్బంధించిన పాక్.. ఏఫ్రిల్ 29న 55 మంది మత్స్యకారులు, ఐదుగురు పౌరులను విడుదల చేసింది. గతేడాది కరాచీలోని లంధీ, మాలిర్ జైళ్ల నుంచి మూడు విడతల్లో దాదాపు 250 మంది మత్స్యకారులను […]
కరాచీ: భారత్కు చెందిన 34 మంది మత్స్యకారులను పాక్ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న 60 మందిని విడుదల చేసిన 10 రోజుల వ్యవధిలోనే పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో మరో 34 మందిని అరెస్టు చేసింది. జనవరిలో గుజరాత్కు చెందిన ఐదుగురు పడవలు నడిపే వారిని నిర్బంధించిన పాక్.. ఏఫ్రిల్ 29న 55 మంది మత్స్యకారులు, ఐదుగురు పౌరులను విడుదల చేసింది. గతేడాది కరాచీలోని లంధీ, మాలిర్ జైళ్ల నుంచి మూడు విడతల్లో దాదాపు 250 మంది మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. అరేబియా సముద్రంలో పాక్-భారత్ల మధ్య స్పష్టమైన సరిహద్దు రేఖ లేకపోవడం, మత్స్యకారుల వద్ద హద్దు రేఖను నిర్దిష్టంగా కనిపెట్టే పరికరాలు లేనందున ఇరుదేశాలు తరచుగా వారిని నిర్బంధిస్తూ ఉంటాయి. ఓ నివేదిక ప్రకారం భారత జైళ్లల్లో పాకిస్థాన్కు చెందిన 347 మంది బందీలుగా ఉన్నారు.