Students Plant Tree: డిగ్రీ పట్టా పొందాలంటే ఆ పని చేయాల్సిందే.. పర్యావరణ హితం కోసం కొత్త నిర్ణయం తీసుకున్న ఫిలిప్పీన్స్..
New Law In Philippines: ఇప్పుడు యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. యావత్ ప్రపంచ దేశాలు ఈ విషయమై తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తూ...
New Law In Philippines: ఇప్పుడు యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. యావత్ ప్రపంచ దేశాలు ఈ విషయమై తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నాయి. అయితే తమంతట తాము ముందుకు వచ్చి చెట్లు నాటే వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ క్రమంలోనే ప్రజలతో మొక్కలు నాటించేందుకు ఒక్కొ ప్రభుత్వం ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. డిగ్రీ పట్టా పొందాలనుకునే ఏ విద్యార్థైనా సరే ముందుగా పది మొక్కలు నాటాలి. ఇందులో భాగంగానే ఫిలిప్పీన్స్ చట్టసభలో గతేడాది ఈ నిర్ణయానికి చట్టం రూపం తీసుకొచ్చారు. ఓ విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని..హై స్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో…10 మొక్కలు తప్పనిసరిగా..నాటాలని ఆ చట్టంలో పొందుపరిచారు. ఈ విధానం వల్ల..ప్రతి ఏటా…175 మిలియన్ మొక్కలు నాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగానే అభినందించతగినది కదూ.
Also Read: విడాకులు కోరినందుకు లెబనాన్ లో తన భార్యను హతమార్చిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు