Pakistan: తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం
ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ (Power Crisis) కు మరో కష్టాలు చుట్టుముట్టాయి. దాయాది దేశంలో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో గంటల కొద్దీ విద్యుత్ కోతలు...
ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ (Power Crisis) కు మరో కష్టాలు చుట్టుముట్టాయి. దాయాది దేశంలో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో గంటల కొద్దీ విద్యుత్ కోతలు పెట్టేస్తున్నారు. ఫలితంగా అత్యవసర సేవలూ నిలిచిపోయాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వస్తున్నట్లు టెలికాం ఆపరేటర్లు వార్నింగ్ ఇచ్చారు. జులై నెలలో డిమాండుకు సరిపడా కరెంటును సరఫరా చేయలేకపోవచ్చని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందే హెచ్చరించారు. అయినప్పటికీ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. కాగా.. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొనుగోలు చేసేందుకు ఖతర్ తో పాకిస్తాన్ (Pakistan) ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, డిమాండ్కు సరిపడా వనరులను పెంచకపోవడం, చెల్లింపులు చేసేందుకు ఇబ్బందులు తలెత్తడంతో దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా ఉత్పత్తి, వినియోగం మధ్య తేడా చావా ఏర్పడింది.
ఈ కారణంగా దేశంలో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ అధికారుల టైమింగ్స్ తగ్గించడంతో పాటు మాల్స్, ఫ్యాక్టరీలు కూడా తొందరగా మూసేసేలా ఆదేశాలిచ్చింది. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. పాకిస్తాన్ రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతోంది. విదేశీ పెట్టుబడులు లేకపోవడం దీనికి కారణంగా తెలుస్తోంది. విదేశీ రుణాల భారంతో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
అంతర్జాతీయ వార్తల కోసం