మెక్సికో బార్లో దుండగుల బీభత్సం
మెక్సికోలో రక్తపాతం సృష్టించారు దుండగులు. కోట్ జకోల్ కోస్లోని కాబల్లా బ్లాంకో బార్లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తలుపులను మూసివేసి బార్కు నిప్పంటించారు. ఈ ఘటనలో 25మంది మృతి చెందగా..మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 8 మంది మహిళలున్నారు. ఐతే ఈ ఘటనకు రెండు ముఠాల మధ్య గొడవలే కారణమని భావిస్తున్న అధికారులు..ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మెక్సికోలో రక్తపాతం సృష్టించారు దుండగులు. కోట్ జకోల్ కోస్లోని కాబల్లా బ్లాంకో బార్లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తలుపులను మూసివేసి బార్కు నిప్పంటించారు. ఈ ఘటనలో 25మంది మృతి చెందగా..మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 8 మంది మహిళలున్నారు. ఐతే ఈ ఘటనకు రెండు ముఠాల మధ్య గొడవలే కారణమని భావిస్తున్న అధికారులు..ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.