Joe Biden Team: జో బైడెన్ బృందంలో కశ్మీరీ మహిళకు చోటు.. ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్గా సమీరా ఫాజిలి
Joe Biden Team: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్ మూలాలున్న సమీరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలిలో చోటు..
Joe Biden Team: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్ మూలాలున్న సమీరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలిలో చోటు దక్కింది. ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్గా ఆమె కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె నియామకానికి సంబంధించి గురువారమే బైడెన్ బృందం ఓ ప్రకనట విడుదల చేసింది. కాగా, భారత సంతతికి చెందిన కమలా హారిస్ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్ను బడ్జెట్ చీఫ్గా, వేదాంత్ పటేల్కు వైట్హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్ రెడ్డిని స్వీచ్ రైటింగ్ డైరెక్టర్గా బైడెన్ బృందంలో చోటు దక్కించుకున్నారు. విధంగా గౌతమ్ రాఘువన్, కశ్మీరీ మహిళ ఈషా షా (వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్) కూడా కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు సమీరా కూడా ఈ జాబితాలో చేరిపోయారు.
బరాక్ ఒబామా అనుచరురాలిగా గుర్తింపు
కాగా, న్యూయార్క్లోని విలియమ్స్ విల్లేలో సమీరా ఫాజిలి జన్మించారు. ఆమె తల్లిదండ్రులు యూసఫ్, రఫీకా ఫాజిలు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె.. హార్వర్డ్ కాలేజీ, యేల్ లా స్కూల్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. యేల్ లా స్కూల్లో లెక్చరర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. కన్జూమర్, హౌజింగ్, చిరు వ్యాపారాలు, మైక్రోఫైనాన్స్ తదితర విభాగాల్లో పని చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుచరురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సమీరా ఫాజిలి గతంలో అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక అభివృద్ధి డైరెక్టర్గా పని చేశారు. అలాగే ఎన్ఈసీ సీనియర్ పాలసీ అడ్వైజర్గా విధులు నిర్వర్తించారు. కాగా, ఈనెల 20న 46వ అమెరికా దేశ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.