బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తూ.. 272 మంది ఎన్నికల సిబ్బంది మృత్యువాత
ఇండోనేషియాలో పది రోజుల క్రితం జరిగిన ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 260 మిలియన్ల మంది ఆ ఎన్నికల్లో భాగస్వాములవగా ఖర్చును భారీగా తగ్గించే ఉద్దేశంతో అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ పార్లమెంటరీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగగా 80 శాతం ఓటింగ్ నమోదైంది. 193 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఒక్కో […]
ఇండోనేషియాలో పది రోజుల క్రితం జరిగిన ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 260 మిలియన్ల మంది ఆ ఎన్నికల్లో భాగస్వాములవగా ఖర్చును భారీగా తగ్గించే ఉద్దేశంతో అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ పార్లమెంటరీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగగా 80 శాతం ఓటింగ్ నమోదైంది. 193 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఒక్కో ఓటరూ ఐదు బ్యాలెట్ పేపర్లపై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం సక్సెస్ అయింది.
అయితే లెక్కింపులో మాత్రం ఫెయిల్ అయింది. ఆ ఎన్నికల కౌంటింగ్ లో 272 మంది ఎన్నికల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో గంటల తరబడి లెక్కించడంతో అలసటకు గురై పలు రోగాల బారినపడి వీరంతా మృతి చెందినట్టు ఆదివారం ఓ అధికారి తెలిపారు. మరో 1,878 మంది అనారోగ్యం బారిన పడగా వీరందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇండొనేసియా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి బాగా పెంచడం వల్ల, వారి చేత ఎక్కువ గంటలు పనిచేయించడం వల్లే ఇలా జరిగిందని అక్కడి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తిచేసి మే 22 నాటికి దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడించాలని ప్రభుత్వం పనిచేస్తుంది. చనిపోయిన వారికి పరిహారంతో పాటు కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.