యుద్ధం మీదైతే.. ముగింపు మాది: ఇమ్రాన్ అసిస్టెంట్
యుద్ధం ప్రారంభించడం తమ బ్లడ్లోనే లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దోస్ అసిఖ్ అవాన్ అన్నారు. గవర్నర్ భవన్లో ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆమె.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రారంభించదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదని ఆమె అన్నారు. అంతేకాదు ఎప్పుడైనా యుద్ధపరిస్థితులు ఏర్పడితే.. ఆర్మీతో పాటు ప్రతి పాక్ దేశీయుడూ దేశం కోసం పోరాడుతాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ భారత్ యుద్ధానికే తలబడితే.. దానికి మేము ముగింపు పలుకుతాం అని […]
యుద్ధం ప్రారంభించడం తమ బ్లడ్లోనే లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దోస్ అసిఖ్ అవాన్ అన్నారు. గవర్నర్ భవన్లో ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆమె.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రారంభించదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదని ఆమె అన్నారు. అంతేకాదు ఎప్పుడైనా యుద్ధపరిస్థితులు ఏర్పడితే.. ఆర్మీతో పాటు ప్రతి పాక్ దేశీయుడూ దేశం కోసం పోరాడుతాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ భారత్ యుద్ధానికే తలబడితే.. దానికి మేము ముగింపు పలుకుతాం అని అవన్ వెల్లడించారు.
కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న పాకిస్థాన్ కోర్కెను తన బలహీనతగా పొరుగున ఉన్న భారతదేశం పరిగణించరాదు అని అవన్ తెలిపారు. అలాగే ఇండియాతో తప్పనిసరిగా చర్చలు జరుపుతామన్న తమ అభిమతాన్ని కూడా వీక్నెస్గా భావించరాదని ఆమె అన్నారు. కశ్మీర్లు వాటాదారులుగా ఉన్నంతవరకు పాకిస్థాన్, భారత్కు సంబంధించిన ఏ విషయాల్లోనూ తలదూర్చదని అవన్ చెప్పుకొచ్చారు.