హిందూ, క్రైస్తవ మహిళలను చైనాకు ఉంపుడుగత్తెలుగా పంపుతున్న పాకిస్తాన్
పాకిస్తాన్ చేస్తున్న దుష్కృత్యాల గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది.. ఆ దేశంలో మైనారిటీల బాగోగుల ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే..
పాకిస్తాన్ చేస్తున్న దుష్కృత్యాల గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది.. ఆ దేశంలో మైనారిటీల బాగోగుల ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే.. ఎంతసేపూ మనమీద పడి ఏడ్వడమే తప్ప తమ దేశంలో మైనారిటీలు ఎంత దారుణపరిస్థితిని ఎదుర్కొంటున్నారో అన్న విషయాన్ని పాక్ ఏనాడూ పట్టించుకోలేదు. తమ దేశంలోని హిందూ, క్రైస్తవ యువతులను చైనాకు ఎగుమతి చేస్తున్నదట పాకిస్తాన్.. ఈ సంచలన విషయాన్ని చెప్పింది అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ బ్రౌన్బ్యాక్. అక్కడికి పెళ్లి కూతుళ్లుగానో, ఉంపుడుగత్తెలుగానే పంపుతున్నదని బ్రౌన్బ్యాక్ ఆరోపించారు. పాకిస్తాన్లో మైనారిటీలపై వివక్ష ఉందని, ఇది వారికి ఎంతో చేటు చేస్తున్నదని ఆయన అన్నారు. అందుకే అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం పాకిస్తాన్ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. జనాభాను కంట్రోల్ చేయడానికి చైనా చాలాకాలం పాటు వన్ చైల్డ్ విధానాన్ని అమలు చేసింది.. పైగా అక్కడా అబ్బాయిలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఓ చెడు సంప్రదాయం ఉంది.. అందుకే చైనాలో మహిళల కొరత విపరీతంగా ఉంది.. ఆ కారణంగానే అక్కడి పురుషులు ఇతర దేశాల నుంచి మహిళలను తెప్పించుకుంటున్నారు. దైవదూషణ, మతాన్ని భ్రష్టుపట్టించేవారికి వివిధ దేశాల్లో తగు శిక్షలు ఉంటాయి.. ఇందుకుగాను ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో ఉన్న జనాభాలో సగం మంది పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గుతున్నారని బ్రౌన్బ్యాక్ తెలిపారు. వాస్తవానికి భారతదేశాన్ని కూడా ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా నియమించాలని అమెరికా కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం విదేశాంగశాఖకు సిఫారసు చేసింది.. కానీ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ రికమెండేషన్ను అంగీకరించలేదు.