చైనా కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు.. 44 మంది మృతి

బీజింగ్‌ : చైనాలోని ఓ కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు సంభవించింది. చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. యాన్‌చెంగ్‌ పట్టణంలోని తియాన్‌జియాయీ రసాయన పరిశ్రమలో గురువారం ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో భవనాలు […]

చైనా కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు.. 44 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 10:09 AM

బీజింగ్‌ : చైనాలోని ఓ కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు సంభవించింది. చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. యాన్‌చెంగ్‌ పట్టణంలోని తియాన్‌జియాయీ రసాయన పరిశ్రమలో గురువారం ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపురాకపోవడంతో ఇంకా విష వాయువులు లీకయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని పేలుళ్లు సంభవించవచ్చని భావిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని దాదాపు 1000 నివాస గృహాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి దాదాపు 3500 మంది ప్రత్యేక వైద్య సిబ్బందిని రంగంలోకి దింపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి పరిశ్రమలోని కిటికీ అద్దాలు దాదాపు 6కి.మీ దూరంలో పడ్డట్లు అక్కడి మీడియా పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..