ఇరాక్లో ఆత్మాహుతి దాడి.. 8మంది మృతి
ఇరాక్ మరోసారి రక్తసిక్తమైంది. గురువారం సాయంత్రం ఆ దేశ రాజధాని బాగ్దాద్ నగరంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 15మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ నెల సందర్భంగా రద్దీగా ఉండే స్థానిక జమీలా మార్కెట్లో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు ఆగంతకుడు. సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఇరాక్ మరోసారి రక్తసిక్తమైంది. గురువారం సాయంత్రం ఆ దేశ రాజధాని బాగ్దాద్ నగరంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 15మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ నెల సందర్భంగా రద్దీగా ఉండే స్థానిక జమీలా మార్కెట్లో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు ఆగంతకుడు. సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.