Pakistan Bomb Blast: పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. 17మంది మృతి.. 90 మందికి తీవ్రగాయాలు..

పాకిస్థాన్ లోని పెషావర్ భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదులో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 17 మంది మృతి చెందారు. 90 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 25 మంది..

Pakistan Bomb Blast: పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. 17మంది మృతి.. 90 మందికి తీవ్రగాయాలు..
Blast In Peshawar
Follow us

|

Updated on: Jan 30, 2023 | 4:14 PM

పాకిస్థాన్ లోని పెషావర్ భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదులో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 17 మంది మృతి చెందారు. 90 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 25 మంది పోలీసులున్నారు. స్థానికంగా ఒక మసీదులో ప్రార్ధనల కోసం పెద్ద సంఖ్యలు ప్రజలు గుమికూడారు. సరిగ్గా ఈ సమయంలో ఇక్కడ భారీ పేలుడు సంభవించిందనీ, పేలుడు ధాటికి భవనంలోని ఒక భాగం కూలిపోయింది. ఈ శకలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

భద్రతా అధికారుల ప్రకారం.. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి ప్రార్థన సమయంలో ముందు వరుసలో ఉన్నాడు, అతను తనను తాను పేల్చుకున్నాడు. ప్రార్థనలు చేస్తున్న ప్రజలు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..