ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి
గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,82,699 కోవిడ్ కేసుల సంఖ్య నమోదవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,58,804కి చేరింది. ఇక అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్గా 6,82,999 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 59,14,285 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,18,44,519 మంది కోవిడ్తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడుతోన్న విషయం తెలిసిందే. కాగా గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,82,699 కోవిడ్ కేసుల సంఖ్య నమోదవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,58,804కి చేరింది. ఇక అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్గా 6,82,999 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 59,14,285 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,18,44,519 మంది కోవిడ్తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 47,05,889కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,56,747 మంది మృతి చెందారు. అలాగే 22,21,570 యాక్టీవ్ కేసులు ఉండగా, 23,27,572 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.
అలాగే భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,95,988కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,65,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 10,94,374 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 764 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి బారినపడి 36,511 మంది మరణించారు.