ప్రతి దృశ్యం ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి..

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుంది. వర్తమాన అంశాలని భవిష్యత్ తరాలకు అందిస్తుంది. మధుర జ్ఞాపకాలని తరతరాలకి భద్రపరుస్తుంది. పండుగలు ,పబ్బాలు, వివాహాలు ,వేడుకలు ,విహారాలు ,విషాదాలు, సాహసాలు .. అన్నిటికీ ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది.

ప్రతి దృశ్యం ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి..
Follow us

|

Updated on: Aug 19, 2020 | 7:22 PM

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుంది. వర్తమాన అంశాలని భవిష్యత్ తరాలకు అందిస్తుంది. మధుర జ్ఞాపకాలని తరతరాలకి భద్రపరుస్తుంది. పండుగలు ,పబ్బాలు, వివాహాలు ,వేడుకలు ,విహారాలు ,విషాదాలు, సాహసాలు .. అన్నిటికీ ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రించుకు పోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి.. దాగుంటుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగురుతులు ఫొటోలు మాత్రమే. అందుకనే నేటి దైనందిన జీవితంలో ఫొటోగ్రఫీ ఒక భాగంగా మారింది. ప్రస్తుతం ఫోటో కి మరింత డిమాండ్ పెరుగుతున్న నేపథ్యం లో ఫోటోగ్రఫీ వృత్తి చేపట్టిన వారి భవిష్యత్తు కి ఏమీ డోకా లేదు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోతో జీవితం ముడిపడిన అందరికీ శుభాభినందనలు.

దశాబ్దాలుగా ఫోటోలు తీయడం ఎన్నో దశలు దాటుతూ వస్తోంది. ఫోటోగ్రఫీకి ప్రధానం గా కావాల్సింది సృజనాత్మకత. అలాగే కెమెరా కన్ను ఉండాలి. చాలా రోజులు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలదే పై చేయి.. ఇప్పటికి కొన్ని ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే బావుంటాయి. ఎప్పటికప్పుడు వస్తున్న అధునాతన టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మార్పులు ఎన్ని వచ్చినా జీవితం లో ఫోటోది విడదీయలేని బంధమే. స్మార్ట్ ఫోన్ లు వచ్చాక ఫోటోగ్రఫీ మరీ తేలిక అయింది. ఇక సెల్ఫీ ఫోటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతుంది. .కొన్ని సందర్భాలలో సెల్ఫీల విపరీత పోకడల తో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఫోటోగ్రఫీ వృత్తి, ప్రవృత్తి గా మారిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19 తేదీన ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవా’న్ని జరుపుకుంటారు. ఆధునిక ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ‘డాగ్యుర్రె టైప్‌’ ను కనుగొనడం ఈ ఫొటోగ్రఫీ దినోత్సవానికి మూలం. ఈ ప్రక్రియను లూయిస్‌ జాకురెస్‌ డాగ్యుర్రె అభివద్ధిపరిచాడు. మొట్టమొదటి సారిగా ఛాయాచిత్రాలను తయారుచేయటానికి శ్రీకారం చుట్టింది ఫ్రాన్స్‌ దేశానికి చెందిన లూయిస్‌ జాకురెస్‌ డాగ్యుర్రె. 1553లో బిఫోర్ట్‌ అనే సాధరణ వ్యక్తి కెమెరాను కనిపెట్టాడు. అయితే లూయిస్‌ డాగ్యుర్రె మొదట గాజు పలకపై కొన్ని రసాయనాలను పోసి, ఛాయాచిత్రాన్ని రూపొందించాడు. అది 1839 ఆగస్టు19న కావడంతో ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ఫోటోగ్రఫీ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

ఫోటోగ్రఫీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ అధునిక రంగంలో దూసుకెళ్తోంది. 1901లో మార్కెట్లోకి ”కొడక్‌ బ్రౌనీ” రావడంతో ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి వీలైన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. తొలి డిజిటల్‌ స్కానింగ్‌ ఫోటోగ్రాఫ్‌ 1957లో మొదలైంది. డిజిటల్‌ స్కానింగ్‌ ప్రక్రియను ‘రస్కెల్‌ ఎ కిర్స్చ్‌’ అనే కంప్యూటర్‌ పరిజ్ఞాని కనుగొన్నాడు. కెమేరా ఇమేజ్‌లను కంప్యూటర్‌లోకి ఫీడ్‌ చేశాడు. తొలి కలర్‌ ఇమేజ్‌ను 1861లో ఫోటోగ్రాఫ్‌ చేసినా, కలర్‌ ఫోటోగ్రఫీపై 19వ శతాబ్ధి అంతా పరిశోధన కొనసాగింది. దశాబ్ధాలు గడిచేకొద్దీ రకరకాల కెమేరాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇలా నేడు అరచేతిలో ఇమిడిపోయి, కనురెప్ప పాటులో ‘క్లిక్‌’ అనిపించే ఫోటోగ్రఫీ వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగి ఉంది. ప్రస్తుతం ఫోటోగ్రఫీ చేయితిరిగిన ఫోటోగ్రాఫర్లకే పరిమితం కావడం లేదు. అందర్నీ సామాజిక కోణంలో ఆలోచింపజేసే ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దుతోంది. తమ ఫొటోలు తామే తీసుకునే ”సెల్ఫీ” ల ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది. సెల్ఫీ ఫొటోలు క్షణాల్లోనే సోషల్‌ మీడియా ద్వారా అందరికీ చేరుతున్నాయి. ఇలా ఫొటోచిత్రణ ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ప్రపంచాన ‘క్లిక్‌ క్లిక్‌’ అంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు