దంచికొట్టిన ఇంగ్లాండ్.. భారత్ ముంగిట భారీ స్కోరు!

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (111: 109 బంతుల్లో 10×4, 6×6), జాసన్ రాయ్ (66: 57 బంతుల్లో 7×4, 2×6),  బెన్‌ స్టోక్స్ (67 నాటౌట్: 48 బంతుల్లో 5×4, 2×6) భారత బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. ఇక భారత […]

దంచికొట్టిన ఇంగ్లాండ్.. భారత్ ముంగిట భారీ స్కోరు!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 30, 2019 | 9:44 PM

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (111: 109 బంతుల్లో 10×4, 6×6), జాసన్ రాయ్ (66: 57 బంతుల్లో 7×4, 2×6),  బెన్‌ స్టోక్స్ (67 నాటౌట్: 48 బంతుల్లో 5×4, 2×6) భారత బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. ఇక భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ 5 వికెట్లు తీయగా.. కుల్దీప్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. ఒక దశలో 400 పరుగులు చేసే దశలో ఇంగ్లాండ్ అడుగులు వేసినా.. భారత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 337 పరుగులే చేయగలిగింది.

మరోవైపు 2011 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ దిగి నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లకు 338 పరుగులు చేసింది. అప్పటి కెప్టెన్ ఆండ్రీ స్ట్రాస్ సెంచరీతో కదంతొక్కాడు. ఇక ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ 338 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కూడా 338 పరుగులు టార్గెట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.