ప్రపంచకప్ 2011 ఫైనల్ పై విచారణ చేపట్టిన శ్రీలంక ప్రభుత్వం
శ్రీలంక క్రికెట్ జట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహీనందనందపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సెక్రటరీ రువాన్చంద్ర తెలిపారు. 2011 ప్రపంచకప్ సమయంలో శ్రీలంక క్రికెట్ జట్టు భారతదేశానికి అమ్ముడు పోయిందని మహినంద ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీలంక క్రికెట్ జట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహీనందనందపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సెక్రటరీ రువాన్చంద్ర తెలిపారు. 2011 ప్రపంచకప్ సమయంలో శ్రీలంక క్రికెట్ జట్టు భారతదేశానికి అమ్ముడు పోయిందని మహినంద ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అదే విథంగా మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేఫథ్యంలో స్పందించిన ఆ దేశ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ 2011నాటి చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వను విచారించనున్నట్లు సమాచారం.