భారత్తో అణుయుద్ధం.. ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత్కు వ్యతిరేకంగా తమ దేశం మొదటిగా అణ్వాయుధాల్ని ఉపయోగించదని అన్నారు. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువైతే.. ప్రపంచం ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. లాహోర్లోని సిక్కులకు సంబంధించిన […]
జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత్కు వ్యతిరేకంగా తమ దేశం మొదటిగా అణ్వాయుధాల్ని ఉపయోగించదని అన్నారు.
ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువైతే.. ప్రపంచం ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. లాహోర్లోని సిక్కులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పటికీ కూడా తాము మొదట యుద్ధం చేయబోమని ఇమ్రాన్ స్పష్టం చేశారు.
గత నెలలో ఫ్రాన్స్లో జరిగిన జి -7 సమావేశంలో కూడా ప్రధాని మోదీ కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని చెప్పుకొచ్చారు. “భారత్, పాకిస్తాన్ల మధ్య అనేక ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయని… ఇక ఆ సమస్యలను ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకుంటామని అన్నారు. అంతేకాకుండా తమ మధ్య ఏ మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని ప్రధాని మోదీ తెలిపారు.
ఇక జమ్మూకాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్తో తాము అణుయుద్ధానికి సిద్ధమేనని గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన కొందరు మంత్రులు కూడా పూటకో మాట మారుస్తూ పరిస్థితులను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమన్హారం.