రాష్ట్రపతి నుంచి ‘నారీ శక్తి పురస్కారాలు’ .. అవార్డు అందుకున్న ఏపీ మహిళ
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆదివారం 12 మంది మహిళలు ' నారీ శక్తి అవార్డులు' అందుకున్నారు. వీరిలో ఏపీ.శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ కూడా ఉన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆదివారం 12 మంది మహిళలు ‘ నారీ శక్తి అవార్డులు’ అందుకున్నారు. వీరిలో ఏపీ శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ కూడా ఉన్నారు. ఆమెతో బాటు ముంగేర్ (బీహార్) కి చెందిన బీనాదేవి, శ్రీనగర్ కు చెందిన ఆరిఫా జాన్, ఝార్ఖండ్ కు చెందిన ఛామీ ముర్ము, లేహ్ (లడఖ్) కు చెందిన నీల్జా వాగ్మో , మహారాష్ట్రవాసి రష్మీ, పంజాబ్ వాసి 103 ఏళ్ళ మాన్ కౌర్, తదితరులు ఉన్నారు. కాగా-గ్రామీణ మహిళా రైతుల అభ్యున్నతి , గిరిజన మహిళా అభివృద్ధి కోసం పడాల భూదేవి ఎంతగానో కృషి చేశారు. తన 11 ఏళ్ళ వయస్సులోనే వివాహమై భర్త, అత్తమామల నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, తన ముగ్గురు కూతుళ్లతో అన్ని కష్టాలను ఎదుర్కొని పేద మహిళల కు రోల్ మోడల్ గా నిలిచింది ఆమె స్వయంకృషితో వారు ఎదిగేందుకు తనవంతు చేయూతను అందించింది. ఇక పంజాబ్కు చెందిన మాన్ కౌర్ 93 ఏళ్ళ వయస్సులో అథ్లెటిక్ చాంపియన్ కావడం విశేషం. నాలుగు ట్రాక్ అండ్ ఫీల్డ్ అవార్డులు కూడా అందుకుంది ఆమె.. పోలండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న మాన్ కౌర్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
President Kovind presented the Nari Shakti Puraskar to Padala Bhudevi from Srikakulam, Andhra Pradesh. She has been working for the development of tribal women, widows and Podu lands through a community based organization Chinnai Adhivasi Vikas Society. pic.twitter.com/NoYxfxyrJa
— President of India (@rashtrapatibhvn) March 8, 2020