ఎంపీడీవోను పరుగులు పెట్టించిన మహిళలు

కర్నూలు జిల్లా ఆస్పరి ఎంపీడీఓ ఆఫీస్‌ ముందు కొద్ది ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని ఐనేకళ్ళు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంలో అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్‌‌తో వాగ్వాదం జరిగింది… నిరసనకు వచ్చినవారితో కొద్దిగా దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు ఎంపీడీఓపై దాడికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఎంపీడీఓ పరుగులు తీశారు. దీంతో […]

ఎంపీడీవోను పరుగులు పెట్టించిన మహిళలు
Follow us

|

Updated on: May 29, 2020 | 6:11 PM

కర్నూలు జిల్లా ఆస్పరి ఎంపీడీఓ ఆఫీస్‌ ముందు కొద్ది ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని ఐనేకళ్ళు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంలో అక్కడికి చేరుకున్న ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్‌‌తో వాగ్వాదం జరిగింది… నిరసనకు వచ్చినవారితో కొద్దిగా దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు ఎంపీడీఓపై దాడికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఎంపీడీఓ పరుగులు తీశారు. దీంతో ఆయను వాష్‌ రూమ్‌లో‌కి వెళ్లి డోర్‌ పెట్టుకున్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీఓ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.