‘మహిళలూ ! ఆ రోజున నా ట్విటర్ యూజర్లు మీరే’! మోదీ
ప్రధాని మోదీ ఓ మిస్టరీ అనౌన్స్మెంట్ చేశారు. ఈ నెల 8 న మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను వారికి అప్పగిస్తానని ప్రకటించారు.
ప్రధాని మోదీ ఓ మిస్టరీ అనౌన్స్మెంట్ చేశారు. ఈ నెల 8 న మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను వారికి అప్పగిస్తానని ప్రకటించారు. వారి లైఫ్, వారి పనితీరు, కృషి మనలకు స్ఫూర్తినిస్తాయన్నారు. దీనివల్ల లక్షలాదిమంది మోటివేట్ అవుతారన్నారు. ‘అలాంటి మహిళల గురించి తెలుసా ? ‘షీ ఇన్స్పైర్ అజ్’ అనే పదాన్ని వినియోగించడం ద్వారా వారి కథనాలను షేర్ చేయండి’ అన్నారు. ఈ ఆదివారం ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్స్టాగ్రామ్, యూట్యూబ్ మీకు అప్పగిస్తున్నాను.. ‘ అని మోదీ పేర్కొన్నారు. అయితే ఆయన సన్నిహితుల్లో చాలామంది అప్పుడే ‘ నో సర్ ‘అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల వర్షం కురిపించారు. ఇది టాప్ ట్విటర్ ట్రెండ్గా మారింది.
This Women’s Day, I will give away my social media accounts to women whose life & work inspire us. This will help them ignite motivation in millions.
Are you such a woman or do you know such inspiring women? Share such stories using #SheInspiresUs. pic.twitter.com/CnuvmFAKEu
— Narendra Modi (@narendramodi) March 3, 2020