ఫ్లాష్..ఫ్లాష్.. జన్‌ధన్‌ ఖాతా దారులకు శుభవార్త..!

ప్రధాన మంత్రి జన్‌ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు కేంద్ర శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజానికి కాస్త ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం డిసైడ్ అయ్యింది. “పీఎం గరీబ్ కల్యాణ్” ప్యాకేజీ కింద.. ప్రధాన మంద్రి జన్ ధన్ యోజన అకౌంట్స్‌ ఉన్న మహిళలందరికీ.. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.500 […]

ఫ్లాష్..ఫ్లాష్.. జన్‌ధన్‌ ఖాతా దారులకు శుభవార్త..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 8:24 AM

ప్రధాన మంత్రి జన్‌ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు కేంద్ర శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజానికి కాస్త ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం డిసైడ్ అయ్యింది. “పీఎం గరీబ్ కల్యాణ్” ప్యాకేజీ కింద.. ప్రధాన మంద్రి జన్ ధన్ యోజన అకౌంట్స్‌ ఉన్న మహిళలందరికీ.. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.500 నగదును జమచేయనుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయా అకౌంట్స్‌లో ఈ డబ్బులు వేయనున్నారు. అకౌంట్‌లో నగదు క్రెడిట్ అయిన తర్వాత.. ఆ డబ్బును ఎప్పుడైనా విత్‌ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు.. మరో నిర్ణయం కూడా తీసుకుంది. మహిళల అకౌంట్‌లను కేవైసీ పత్రాలు లేవన్నరీజన్‌తో చిన్న చిన్న అకౌంట్స్‌ను స్థంభింపచజేయవద్దని సూచించింది. ఆ అకౌంట్స్‌ను వెంటనే యాక్టివేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి జన్ ధన్ అకౌంట్స్‌ ఉన్న మహిళలు.. ఓ సారి వారివారి ఖాతాలను చెక్ చేసుకోండి.