అమానుష ఘటన.. నిరాకరించిన పది ఆసుపత్రులు.. మహిళ మృతి
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఒకటి, రెండు కాదు ఏకంగా పది ఆసుపత్రులు ఓ మహిళను జాయిన్ చేసుకునేందుకు నిరాకరించాయి.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఒకటి, రెండు కాదు ఏకంగా పది ఆసుపత్రులు ఓ మహిళను జాయిన్ చేసుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఆమె ప్రాణాలు విడవగా.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్కు చెందిన రోహిత అనే మహిళ గత కొద్దిరోజులుగా జ్వరం, జలుబు, ఆయాసంతో బాధపడుతోంది.
ఇక ఆమె ట్రీట్మెంట్ కోసం భర్త శ్రీకాంత్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది, ఆమెను చేర్చుకోవడం కుదరదని.. కరోనా రోగి అంటూ తిప్పి పంపించారు. ఇదే సమాధానం మరో పది ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కూడా రావడంతో రోహితను తీసుకుని ఆమె భర్త శ్రీకాంత్ చివరికి గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. ఇక అక్కడ జాయిన్ చేసిన కొద్ది నిమిషాలకే ఆమె తుది శ్వాస విడిచింది. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటూ శ్రీకాంత్ ఆరోపించాడు. అంతేకాకుండా రోహిత మృతిపై మానవ హక్కుల సంఘంలో పిటిషన్ కూడా వేశాడు.