కొత్త సంవత్సరం వేళ ఉత్తర ప్రదేశ్లో విషాదం.. సూసైడ్ నోట్ రాసి మహిళ ఎస్ఐ ఆత్మహత్య
కొత్త సంవత్సరం వేళ మహిళ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం సృష్టించింది. కొత్త సంవత్సరం వేళ తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బులంద్షహర్ జిల్లాలోని అనుప్షహర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ అర్జూ పవార్ (30) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవార్ షామ్లీ పట్టణానికి చెందిన అర్జూ పవార్ అనుప్షహర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచం మొత్తం నూతన సంవత్స వేడుకలు జరుపుకుంటున్న వేళ శుక్రవారం రాత్రి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయింది. ఇది గమనించిన ఇంటి యజమాని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అర్జూ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అర్జూ ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, తన చావుకు తానే బాధ్యురాలినని.. తన పనుల వల్లే తనకు ఈ గతి పట్టింది అని ఆమె తన నోట్లో పేర్కొందని పోలీసులు తెలిపారు. అర్జూ మృతికి సంబంధించిన సమాచారాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశామని బులంద్షహర్ ఎస్ఎస్పి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.
A female Sub-inspector of Anupshahr in Bulandshahr district died by allegedly committing suicide in her house
“She was found dead hanging from fan by the neck, by landlady. On being sent to hospital she was declared brought dead. A suicide note was found,” says Bulandshahr SSP pic.twitter.com/gLV9sf8wAx
— ANI UP (@ANINewsUP) January 1, 2021