దారుణ ఘటన.. ఆడపడుచుని వ్యభిచార ముఠాకు అమ్మేసిన వదిన..
ప్రకాశం జిల్లా కందుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే నిర్భయ, దిశా వంటి చట్టాలు వచ్చిన తరువాత కూడా పలు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ బయటి వాళ్ల నుంచే ఆడ పిల్లలకు రక్షణ లేదనుకుంటుంటే.. ఇప్పుడు సొంత అన్నవాళ్లే మరింత క్రూరంగా..
ప్రకాశం జిల్లా కందుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే నిర్భయ, దిశా వంటి చట్టాలు వచ్చిన తరువాత కూడా పలు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ బయటి వాళ్ల నుంచే ఆడ పిల్లలకు రక్షణ లేదనుకుంటుంటే.. ఇప్పుడు సొంత అన్నవాళ్లే మరింత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కందుకూరులో వరుసకు ఆడపడుచయ్యే 13 ఏళ్ల బాలికను వ్యభిచార ముఠాకు అమ్మేసింది సొంత వదిన. బాలిక తల్లిదండ్రులు తరుచూ గొడవలు పడుతూండటంతో.. అన్నా, వదినల వద్ద ఉంటోంది. అయితే బాలిక ఇంట్లో ఉండటం ఇష్టం లేని వదిన.. సింగరాయ కొండకు చెందిన ఓ వ్యభిచార ముఠాకు అమ్మేసింది. అయితే చాకచక్యంతో ప్రవర్తించిన బాలిక వెంటనే ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు బాలికను కాపాడారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.
Read More:
ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..
కరోనా ట్రీట్మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..