రూ.20 లక్షలు లంచం తీసుకుని దొరికిన లేడీ ఎస్ఐ

రేప్ కేసు మాఫీ చేస్తానంటూ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయింది ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. లైంగికదాడి కేసు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అహ్మదాబాద్ పశ్చిమ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శ్వేతా జడేజా రూ. 35 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రూ.20 లక్షలు లంచం తీసుకుని దొరికిన లేడీ ఎస్ఐ
Follow us

|

Updated on: Jul 05, 2020 | 9:23 PM

రేప్ కేసు మాఫీ చేస్తానంటూ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయింది ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. లైంగికదాడి కేసు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అహ్మదాబాద్ పశ్చిమ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శ్వేతా జడేజా రూ. 35 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు ఆమెపై ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కింద కేసు నమోదు చేశారు.

2019లో అహ్మదాబాద్ కు చెందిన ఇద్దరు మహిళలు తాము పనిచేస్తున్న క్రాప్ సొల్యూషన్స్ కంపెనీ ఎండీ కేనాల్ షా తమపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన శ్వేతా జడేజా నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 35 లక్షలు డిమాండ్ చేశారు. 2019లో జరిగిన కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన శ్వేత.. నిందితుడు కేనాల్ షా సోదరుడు భావేశ్‌కు ఫోన్ చేసి రూ. 35 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే, చివరికి ఇద్దరి మధ్య రూ. 20 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా శ్వేతకు రూ.20 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే, మరో రూ.15 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది శ్వేత. దీంతో భావేశ్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శుక్రవారం శ్వేతను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై సంఘ వ్యతిరేక చర్యల చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం ఆమెను సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరారు. అయితే, కోర్టు మాత్రం మూడు రోజుల రిమాండ్‌కు అనుమతినిచ్చింది.