అది ప్రమాదం కాదు.. తల్లే చంపేసింది..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న పిల్లలను వదిలించుకునేందుకు కన్న తల్లే ఘాతుకానికి పాల్పడింది. నిన్న తెల్లవారుజామున పిల్లలను చెరువులోకి తోసి దారుణంగా హత్య చేసింది. భర్త మద్యాననికి బానిసయ్యాడని.. గొడవపడి కోపంతో.. సూర్యపేటకు చెందిన నాగమణి పిల్లలతో కలసి ఆత్మ హత్య...

అది ప్రమాదం కాదు.. తల్లే చంపేసింది..
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 2:13 PM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న పిల్లలను వదిలించుకునేందుకు కన్న తల్లే ఘాతుకానికి పాల్పడింది. నిన్న తెల్లవారుజామున పిల్లలను చెరువులోకి తోసి దారుణంగా హత్య చేసింది. భర్త మద్యాననికి బానిసయ్యాడని.. గొడవపడి కోపంతో.. సూర్యపేటకు చెందిన నాగమణి పిల్లలతో కలసి ఆత్మ హత్య చేసుకోవాలనుకుంది. అయితే ముందు పిల్లలను చెరువులో తోసేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులోకి దిగింది. అయితే ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యం సరిపోకపోవడంతో ప్రయత్నం ఉపసంహరించుకుంది. ఉదయం వరకూ చెరువు వద్దే కూర్చుని విలపిస్తూ.. స్థానికుల కంట పడింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నాగమణి కావాలనే పిల్లను నీటిలో తోసి.. ప్రమాదంగా చిత్రీకరించిందని పోలీసు విచారణలో తేలింది.

వివరాల్లోకి వెళ్తే.. భర్తతో తరచూ తగాదాలు నేపథ్యంలో తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో నాగమణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో తరచుగా ఇంటికి వచ్చేవాడు ప్రియుడు. ఈ విషయం పిల్లలు భర్తకు చెప్పడంతో తరచూ గొడవలు జరిగేవి. గత కొన్ని నెలలుగా ఫోన్‌లో సంభాషిస్తూ ప్రియుడితో జల్సాలు చేసింది మహిళ. అయితే చెరువులో పిల్లను తోసేసి.. అక్కడే తచ్చాడుతూ కనిపించడంతో మార్నింగ్ వాకర్స్ వీడియో తీసి పోలీసులకు అందించారు. వాకర్స్ వీడియో ఆధారంగా కేసుని ఛేదించారు పోలీసులు.

Read More: 

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు.. పదో రోజు ఎంత పెరిగిందంటే?